తెలుగు లిపి పరిణామ పరిశోధనలో మేటి ‘తిరుమల రామచంద్ర’
యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం శుక్రవారం ఉదయం బ్రౌన్శాస్త్రి సమావేశ మందిరంలో తిరుమల రామచంద్ర 112వ జయంతిని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముందుగా సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా॥ చింతకుంట శివారెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులుగా, సంపాదకులుగా, కవిగా, నాటకకర్తగా, విమర్శకులుగా, భాషావేత్తగా, అనువాదకులుగా అనేక ప్రక్రియల్లో రచనలు చేసినప్పటికీ తిరుమల రామచంద్ర తనను తనను తాను ఎంతో వినయంతో ‘భాషా సేవకుడను’ అని అభివర్ణించుకునేవారన్నారు. తిరుమల రామచంద్ర శ్రీకృష్ణదేవరాయల కులగురువైన తిరుమల తాతాచార్యుల వంశీకులని, ఆయన తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త అని అన్నారు. ఆయన పలురకాల వృత్తులు చేయడం ద్వారా, భారతదేశంతోపాటు ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్ వంటి దేశాలు తిరిగి, వివిధ సంస్కృతుల పట్ల చక్కని అవగాహన ఏర్పరచుకున్నారని అన్నారు. ఆయన విద్యార్థిదశలో గాంధీని చూసి ప్రభావితులై స్వాతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళారని అన్నారు. ఆయన ఇతర భాషల్లోని పలు రచనలను తెలుగులోకి అనువదించిన గొప్ప అనువాదకుడని అన్నారు. ‘హంపీ నుంచి హరప్పా దాకా’ అనే ఆయన ఆత్మకథ ఆత్మకథల్లోనే చాలా విలక్షణమైందని, ఆ గ్రంథానికి ఆయన మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందని పేర్కొన్నారు. గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు మాట్లాడుతూ తిరుమల రామచంద్ర ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక,ఆంధ్రభూమి,హిందుస్
డా.ఎస్.వి. సుబ్బారెడ్డి
సంచాలకులు, ప్రజా సంబంధాలు
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప